​​భక్తిని జాగృతం చేయడం
సంస్కృతిని రక్షించ​డం
సమాజాన్ని శక్తివంతం చేయడం
  ఆలయాన్ని దర్శించండి

మార్చి 10, 2010 న స్థాపించబడిన భగవత్ భక్తి ప్రచార ట్రస్ట్ లాభాపేక్ష లేని స్వచ్ఛంద సేవా సంస్థ. ఇది కుల, మత, వర్గ లేదా లింగ భేదాలు లేకుండా సమాజంలోని అందరికీ సమాన ప్రాధాన్యత ఇస్తుంది. భక్తి అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు; అది ప్రతి ఒక్కరి వ్యక్తిగత, కుటుంబ మరియు సామాజిక జీవితాలలో నిబద్ధతను, నిజాయితీని మరియు పరస్పర ప్రేమానురాగాలను నింపే ఒక ఉత్తమ మార్గదర్శకత్వమని మేము విశ్వసిస్తున్నాము. 

About

భగవత్ భక్తి ప్రచార ట్రస్ట్  
Regd no: 12/2010

శ్రీ PVRK ప్రసాద్, IAS (R) మరియు Dr. B.V. పరమేశ్వర రావు గారి అధ్యక్షత తో శ్రీ B. శ్రీరామ్ మూర్తి కార్యదర్శిగా ఈ సంస్థ వ్యవస్థపించదమైనది, సమాజంలో భక్తి భావం ద్వారా మానవతా విలువలను మరియు సామాజిక సామరస్యాన్ని పెంపొందించడానికి స్థాపించబడింది.

మా ముఖ్య లక్ష్యాలు

  • మానవత్వం & భక్తి: క్రమబద్ధమైన భక్తి ప్రచారం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మానవతా సమగ్రతను పెంపొందించడం
  • ఆధ్యాత్మిక యాత్రలు: పవిత్ర నదులు, పుణ్యక్షేత్రాలు మరియు ప్రముఖ చారిత్రక వారసత్వ ప్రదేశాలకు ఆధ్యాత్మిక యాత్రలను నిర్వహించడం.
  • సమగ్ర సామాజిక సేవ: పిల్లలు, మహిళలు, వృద్ధులు మరియు శారీరక/మానసిక వికలాంగుల మానసిక వికాసానికి, ఆధ్యాత్మిక ఉల్లాసానికి అనువైన ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించడం. 
  • సంస్థాగత సమన్వయం: సామాజిక ప్రయోజనాన్ని మరింత విస్తృతం చేయడానికి సమాన ఆశయాలు గల ఇతర ఆధ్యాత్మిక ట్రస్ట్‌లు, దేవాలయాలు మరియు దేవాదాయ సంస్థలతో కలిసి పనిచేయడం.  

జానపద కళల పునరుద్ధరణ

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రామ భజన, చెట్టు భజన, చిటికెలు, చిడతలు మరియు తప్పెటగుళ్లు వంటి ప్రాచీన జానపద కళారూపాలలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. 

9 దేవాలయాల యాత్రా పథకం

ప్రతి గ్రామం నుండి 10 మంది సభ్యులతో కూడిన బృందం 

నగర సంకీర్తన

గ్రామాల్లో పిల్లలు, యువకులు నగర సంకీర్తన 

దేవాలయాల మౌలిక వసతుల అభివృద్ధి

శ్రీ శ్రీ శ్రీ కళ్యాణ వినాయక ఆలయం